పండంటి బిడ్డకు జన్మనిచ్చిన బుల్లితెర నటి మహేశ్వరి.. నెట్టింట చర్చనీయాంశంగా మారిన పోస్ట్!

by Disha Web Desk 6 |
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన బుల్లితెర నటి మహేశ్వరి.. నెట్టింట చర్చనీయాంశంగా మారిన పోస్ట్!
X

దిశ, సినిమా: బుల్లితెర నటి మహేశ్వరి వదినమ్మ సీరియల్ ద్వారా ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. ఆ తర్వాత పలు సీరియల్స్ చేసి ప్రేక్షకులను అలరించింది. అంతేకాకుండా డాన్స్ షో ఇస్మార్ట్ జోడి, ఫ్యామిలీ నెంబర్ 1 వంటి వాటిలో పాల్గొని ఆకట్టుకుంది. ఇక మహి పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. ఈ అమ్మడు కెరీర్ పీక్స్‌లో ఉండగా డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో వర్క్ చేస్తున్న శివనాగ్‌ను ప్రేమించి పెద్దలను ఎదిరించి మరీ పెళ్లి చేసుకుంది.

ఈ జంటకు ఓ కూతురు ఉంది. అయితే మహేశ్వరి గత ఏడాది రెండోసారి ప్రెగ్నెంట్ అయినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక అప్పటి నుంచి పూర్తిగా సీరియల్స్ మానేసి ఇంట్లోనే ఉంటూ తన చానల్‌లో యూట్యూబ్ వ్లాగ్స్ చేస్తుంది. ఇటీవల మహి శ్రీమంతంను గ్రాండ్ రెండుసార్లు భర్త శివ చేసి ఆమెకు సర్‌ప్రైజ్ ఇచ్చాడు. ఈ విషయాన్ని తెలుపుతూ వీడియోలు ఫొటోలు కూడా షేర్ చేశాడు శివ.

ఇదిలా ఉంటే.. తాజాగా, మహేశ్వరి మరోసారి తల్లి అయింది. ఈ రోజు ఉదయం ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని తెలుపుతూ ఆమె భర్త శివ నాగ్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. ఫ్యామిలీ చేతుల ఫొటోలను షేర్ చేశాడు. కానీ తన భార్య మహికి పుట్టింది ఆడపిల్ల, మగపిల్లవాడు అనే విషయాన్ని తెలపలేదు. దీంతో ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట చర్చనీయాంశంగా మారింది. నెటిజన్లు కొందరు మహికి పుట్టింది పాపన, బాబునా అని చర్చించుకుంటున్నారు. అలాగే శివ పోస్ట్‌ను చూసిన సినీ ప్రముఖులు మాత్రం ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.



Next Story

Most Viewed