Shekhar Master: రీతూ చౌదరి నిమ్మకాయల గొడవ టచ్ చేయలేదు.. శేఖర్ మాస్టర్ షాకింగ్ కామెంట్స్

by Anjali |
Shekhar Master: రీతూ చౌదరి నిమ్మకాయల గొడవ టచ్ చేయలేదు.. శేఖర్ మాస్టర్ షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: స్టార్ మా లో ప్రసారమయ్యే ‘కిలాడీ బాయ్స్ ఖిలాడీ లేడీస్’ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. కిర్రాక్ బాయ్స్ టీమ్‍కు ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్, ఖిలాడీ లేడీస్ టీమ్‍కు అనసూయ భరద్వాజ్ లీడర్లుగా ఉన్నారు. అల్లరి పిడుగు శ్రీముఖి దీనికి యాంకర్‌గా వ్యవహరిస్తోంది. తాజాగా ఈ షోకు సంబంధించిన లేటెస్ట్ ప్రోమో ఒకటి సోషల్ మీడియాలో దుమ్ము రేపుతోంది. ఈ షోలో యాంకర్ ఒక కాంటెస్ట్ పెడుతుంది. అంబటి అర్జున్, ఆర్జే చైతు, విష్ణు ప్రియ రీతూ, కలిసి ఇందులో పాల్గొంటారు. ఈ గేమ్ ఆడటానికి నిమ్మకాయలు నిమ్మకాయలు తీసుకుని వాటిని దండలా గుచ్చి శేఖర్ మాష్టర్ కటౌట్‌కి వేయాలి. ఈ టాస్క్ ను అంబటి అర్జున్, ఆర్జే చైతు టీమ్ ఫాస్ట్‌గా పూర్తి చేస్తారు.

ఒక దండలో నిమ్మకాయలు మొత్తం 20 మాత్రమే ఉండాలని.. అంతకు ఎక్కువగా ఉన్నాయంటూ అమ్మాయిలు వాదనకు దిగుతారు. దీంతో రీతూ - ఆర్జే మధ్య గొడవ గట్టిగానే అవుతుంది. అమర్ ఇంకో నిమ్మకాయ పెట్టి ఉంటే విన్ అయ్యేవాడివనుకున్నరా. కానీ 20 పైన ఎక్ట్స్రా పెట్టి ఓడిపోయావురా అనడం మొదటిసారిగా వింటున్నానని అంటార. దీంతో రీతూ వెంటనే స్పందించి.. అందుకే అంటారు బ్రెయిన్ వాడాలని అంటుంది. తర్వాత శేఖర్ మీ నిమ్మకాయల గొడవ నేను టచ్ చేయ్యనని.. ఇంతకు ముందు కూడా టచ్ చేయలేదని అంటాడు. తర్వాత నిమ్మకాయల గొడవ విషయంలో ప్రియాంక సీరియస్ అవుతుంది. దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

Next Story

Most Viewed