- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
రిషి బాటలో వసుధార.. గుప్పెడంత మనసు సీరియల్ కి బై బై చెప్పనున్న రక్షా గౌడ .. షాక్ లో అభిమానులు
దిశ, సినిమా: గుప్పెడంత మనసు సీరియల్ ఎంత పాపులర్ అయిందో మనందరికీ తెలిసిందే. ఈ సీరియల్ హిట్ అవ్వడానికి కారణం.. హీరో హీరోయిన్లు రిషి, వసుధార. వాళ్ళిద్దరి వల్ల .. ఆ సీరియల్ 1000 ఎపిసోడ్ లు దాటి ఇప్పుడు కూడా రన్ అవుతుంది. రిషిధార జంట చుడటానికి చాలా బావుంటుంది. వాళ్లిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ కూడా బాగా పండింది.
అంత క్రేజ్ సంపాదించుకున్న ఈ సీరియల్ రేటింగ్ తగ్గింది. ఎప్పుడైతే రిషి తప్పుకున్నాడో.. అప్పటి నుంచి అభిమానులు కూడా సరిగా చూడటం లేదు. వసుధార చూసిన ప్రేక్షకులకు అంత కిక్ ఉండటం లేదు. రిషి లేని వసుధార పాత్ర గుప్పెడంత మనసులో ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అంటున్నారు. నిర్మాణ సంస్థతో గొడవ కారణం రిషి పాత్రని తీసేసేటప్పటికి అతని పాత్రని క్రమంగా తగ్గిస్తూ వచ్చారు. చివరికి అతని పాత్రనే లేకుండా చేశారు. ఇప్పుడు వసుధార పాత్ర కూడా సేమ్ అంతే. అసలు ఏ మాత్రం ప్రాధాన్యత లేని ఎండీ పాత్ర చేస్తుంది.
వసుధార కాలేజ్కి ఎండీ అయ్యి ఉండి.. మనుపై ఆధారపడుతుందంటే.. అక్కడ ఆమె పాత్రకి ఏమి విలువ ఉన్నట్టు. వసుధార పాత్రకి అర్ధం ఉండాలంటే రిషి రావాల్సిందే. అది జరిగే పని కాదు రిషి లేని వసుధార పాత్ర మాత్రం.. ప్రాణంలేని దేహంలా మారింది. చూస్తూ ఉంటుంటే.. వసుధార పాత్ర కూడా తీసేస్తారేమో అన్నట్టు ఉంది. తెలిసిన సమాచారం ప్రకారం రక్షా గౌడ ఈ సీరియల్ కి త్వరలో బై బై చెప్పనుందని టాక్ వినిపిస్తుంది. ఈ వార్త తెలిసిన నెటిజన్స్ మీరు కూడా లేకపోతే సీరియల్ ఎవరి కోసం చూడాలంటూ ఫీల్ అవుతున్నారు.