Pa. Ranjith: పేపర్ కప్పులో చాయ్ ఇవ్వడం కూడా అంటరానితనమే.. తంగలాన్ డైరెక్టర్ వివాదాస్పద వ్యాఖ్యలు

by Kavitha |
Pa. Ranjith: పేపర్ కప్పులో చాయ్ ఇవ్వడం కూడా అంటరానితనమే.. తంగలాన్ డైరెక్టర్ వివాదాస్పద వ్యాఖ్యలు
X

దిశ, సినిమా: తమిళ దర్శకుడు పా.రంజిత్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఇతను కబాలి, కాలా, సర్పాట్టా పరంబరై వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలతో తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం విక్రమ్ హీరోతో తంగలాన్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా నిన్న థియేటర్లలో విడుదలై.. మిక్స్‌డ్ టాక్‌తో దూసుకుపోతుంది. అయితే ఈ సినిమా విడుదలకు ముందు మూవీతో పాటు డైరెక్టర్ పై సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్న విషయం తెలిసిందే. కేంద్రం తీసుకువస్తున్న ఎస్సీ వర్గీకరణపై పా.రంజిత్ విమర్శలు చేయడంతో అతడిని అతడి సినిమాలను బ్యాన్ చేయాలంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఇదిలావుంటే తాజాగా పా. రంజిత్ అంటరానితనం మీద ఎప్పుడో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘పరియేరుమ్ పెరుమాళ్’ అనే సినిమా టైంలో పా.రంజిత్ మాట్లాడుతూ.. అంటరానితనం అనేది అప్‌డేట్ అవుతుంది. మనకు తెలియట్లేదు అంతే. ఇంతకుముందు చాయ్ పెద్ద కులస్తులకు గ్లాసుల్లో ఇచ్చేవారు. తక్కువ కులం వారికి ప్లాస్టిక్ గ్లాస్‌లో ఇచ్చేవాళ్లు అనంతరం వారికి పేపర్ కప్పుల్లో ఇస్తున్నారు. ఎవరైనా ఇది అడిగితే మీది తక్కువ కులం అనేవారు.

సాధారణంగా చాలా మంది ఇళ్లల్లో ఎవరైనా బంధువులు వస్తే స్టీల్ లేదా గాజు గ్లాస్‌లో చాయ్ ఇస్తాం. అదే ఎవరైనా పని వాళ్లు వచ్చిన తక్కువ కులం వాళ్ళు వచ్చిన పేపర్ కప్పుల్లో పోసి ఇస్తాం. ఎందుకంటే కడగాలి కాబట్టి. అయితే చాలా మందికి ఈ విషయం తెలియదు అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతుండగా.. కొందరేమో ఇతన్ను ట్రోల్ చేస్తుంటే మరికొందరేమో సపోర్ట్ చేస్తున్నారు.


Advertisement

Next Story

Most Viewed