ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకోండి

by  |
ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకోండి
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ సమీపంలోని బొమ్మకల్ గ్రామానికి సంబంధించిన ప్రభుత్వ భూములను కబ్జా చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని టీపీసీసీ అధికార ప్రతినిధి దాసరి భూమయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం కరీంనగర్ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎగ్గె మల్లేశం, పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్లు భూములను కబ్జా చేసినట్టు రెవెన్యూ అధికారులు గుర్తించినందున వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని భూమయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. వేర్వేరుగా ఇచ్చిన ఫిర్యాదులను మీడియాకు విడుదల చేసిన ఆయన తప్పు చేసినవారిపై ఖచ్చితంగా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

Next Story

Most Viewed