కొత్త చట్టానికి మద్దతుగా ట్రాక్టర్లతో ర్యాలీ

by  |
కొత్త చట్టానికి మద్దతుగా ట్రాక్టర్లతో ర్యాలీ
X

దిశ, మెదక్:
వీఆర్ఓ వ్యవస్థను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నూతన చట్టాన్ని ఆమోదించడాన్ని స్వాగతిస్తూ మెదక్ పట్టణంలో అన్నదాతలు ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. వీఆర్‌ఓ వ్యవస్థ రద్దు పట్ల హర్షం వ్యక్తం చేస్తూ వందలాది ట్రాక్టర్లతో పట్టణంలోని బోధన్ స్వాగతం బోర్డు నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ తీశారు. ఈకార్యక్రమాన్ని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. నియోజకవర్గంలోని మెదక్, హవేలీ ఘనపూర్, పాపన్నపేట్, చిన్న శంకరంపేట్ మండలాల నుండి రైతులు ట్రాక్టర్లతో తరలివచ్చారు. ఇన్నాళ్లు భూ దస్త్రాల విషయంలో తాము అనేక ఇబ్బందులు పడ్డామన్నారు. వీఆర్ ఓ వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడం మంచి పరిణామం అని వారు ఆనందం వ్యక్తం చేశారు.

Next Story

Most Viewed