- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, నల్లగొండ: మరికొంతసేపు ఆ యువకుడి ప్రయాణం సాఫీగా సాగి ఉంటే.. వివాహ ముహూర్తం నిర్ణయించి.. లగ్నపత్రిక రాసేవారు. ఇంతలోనే లారీ మృత్యు రూపంలో వచ్చి యువకుడిని బలితీసుకుంది. నల్గొండ జిల్లా త్రిపురారం మండలం బొర్రాయిపాలెంకు చెందిన మొండికత్తి ఏసుకు వివాహ సంబంధం కుదిరింది. ముహూర్తం నిర్ణయించి లగ్న పత్రిక రాసేందుకు బంధువులతో కలిసి అమ్మాయి ఇంటికి బయలుదేరారు. బంధువులంతా ఆటోలో ముందు వెళ్తుండగా తన బావతో కలిసి ఏసు బైక్పై ఆటో వెనకాల బయల్దేరాడు. బైక్ నిడమనూరు మండలం బక్కమంతులపాడు వద్దకు రాగానే వెనక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. తలకు బలమైన గాయం తగలడంతో ఏసు అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. పోలీసులు ఘటనాస్థలానికి వచ్చి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు.
Next Story