మరికాసేపట్లో లగ్నపత్రిక.. అంతలోనే విషాదం

by  |
మరికాసేపట్లో లగ్నపత్రిక.. అంతలోనే విషాదం
X

దిశ, నల్లగొండ: మరి‌కొంతసేపు ఆ యువకుడి ప్రయాణం సాఫీగా సాగి ఉంటే.. వివాహ ముహూర్తం నిర్ణయించి.. లగ్నపత్రిక రాసేవారు. ఇంతలోనే లారీ మృత్యు రూపంలో వచ్చి యువకుడిని బలితీసుకుంది. నల్గొండ జిల్లా త్రిపురారం మండలం బొర్రాయిపాలెంకు చెందిన మొండికత్తి ఏసుకు వివాహ సంబంధం కుదిరింది. ముహూర్తం నిర్ణయించి లగ్న పత్రిక రాసేందుకు బంధువులతో కలిసి అమ్మాయి ఇంటికి బయలుదేరారు. బంధువులంతా ఆటోలో ముందు వెళ్తుండగా తన బావతో కలిసి ఏసు బైక్‌పై ఆటో వెనకాల బయల్దేరాడు. బైక్ నిడమనూరు మండలం బక్కమంతులపాడు వద్దకు రాగానే వెనక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. తలకు బలమైన గాయం తగలడంతో ఏసు అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. పోలీసులు ఘటనాస్థలానికి వచ్చి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు.


Next Story