పోలీసులకు కరోనా కలవరం….

by Shamantha N |   ( Updated:2020-09-09 06:41:04.0  )
పోలీసులకు కరోనా కలవరం….
X

దిశ వెబ్ డెస్క్:
మహారాష్ట్ర పోలీసులను కరోనా కలవర పెడుతోంది. కరోనా బారిన పడుతున్న అధికారుల, సిబ్బంది సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. తాజా బులిటెన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో 533 మంది పోలీసులకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఇప్పటి వరకు పోలీస్ శాఖలో 17,972 కరోనా కేసులు నమోదు అయ్యాయి. కాగా యాక్టివ్ కేసులు సంఖ్య 3,523గా ఉంది. తాజాగా కరోనాతో ముగ్గురు పోలీసులు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు మరణించిన పోలీసుల సంఖ్య 180 కి చేరింది.

Advertisement
Next Story

Most Viewed