- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
భర్త ఇచ్చిన పెళ్లిరోజు కానుకతో ఒక్కసారిగా కోటీశ్వరురాలైనపోయిన మహిళ.. ఎలాగంటే.. (వీడియో)
దిశ, ఫీచర్స్ : ప్రజలు ఎంతో సంతోషంగా ఎంజాయ్ చేసే వేడుకల్లో పెళ్లిరోజు ఒకటి. వెడ్డింగ్ యానివర్సరీ రోజు భార్యా భర్తలు బహుమతులు కూడా ఇచ్చి పుచ్చుకుంటారు. అయితే ఓ మహిళకు తన భర్త కొంత నగదును మ్యారేజ్ డే గిఫ్ట్గా ఇచ్చాడు. కానీ అది ఆమె జీవితాన్నే మార్చేసింది. రాత్రికి రాత్రే కోటిశ్వరురాలిని చేసింది. ఏం జరిగిందంటే..
పంజాబ్కు చెందిన పాయల్ అనే మహిళ ఏప్రిల్లో తన భర్త పెళ్లిరోజు కానుకగా ఇచ్చిన నగదుతో ఆన్లైన్లో లాటరీ టికెట్ కొన్నది. అనుకోకుండా ఆమెకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్లో జాక్పాట్ తగిలింది. రీసెంట్గా దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఆ సంస్థ ప్రమోషన్లో భాగంగా లాటరీ డ్రా కూడా నిర్వహించగా పాయల్ ఒక మిలియన్ డాలర్లు అంటే రూ. 8.3 కోట్లు గెలుచుకుంది. భర్త ఇచ్చిన బహుమతి తన జీవితాన్నే మలుపు తిప్పిందని ఈ సందర్భంగా పాయల్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.
గత పన్నెండేళ్లుగా తను లాటరీలు కొంటున్నానని, కానీ చివరికి మే 16న తనకు జాక్ పాట్ తగిలిందని చెప్పుకొచ్చింది పాయల్. తాను గెలుచుకున్న భారీ ప్రైజ్మనీని తన కుటుంబ భవిష్యత్తుకోసం వినియోగించుకుంటానని, మరికొంత తన సోదరుడికి సాయం చేస్తానని చెప్పింది. ప్రజెంట్ ఈ న్యూస్ వైరల్ అవుతుండగా ‘లక్కు అంటే నీదే’ అంటూ కామెంట్లతో పొగిడేస్తున్నారు నెటిజన్లు.