బైక్‌‌ను వెంబడించి చిరుత దాడి

by srinivas |
బైక్‌‌ను వెంబడించి చిరుత దాడి
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుపతిలో చిరుతపులి దాడి కలకలం రేపింది. జూ పార్క్ రోడ్డు మీదుగా బైక్‌ పై వెళ్తున్న వారిపై చిరుత ఒక్కసారిగా దాడి చేసింది. బైక్ ను వెంబడించి మరీ.. వాహనదారుడి కాలును పట్టిలాగింది. ప్రాణ భయంతో బాధితుడు బండిని వేగంగా పోనిచ్చినప్పటికీ.. కొద్ది దూరం మేర బైక్ వెంట చిరత చేజింగ్ చేసింది. ఈ దాడిలో సదరు వ్యక్తి తీవ్రగాయాలు అయినట్టు సమాచారం. చిరుత సంచారంతో స్థానికులు భయాందోళనలో పడ్డారు.

Advertisement

Next Story

Most Viewed

    null