వైసీపీ ఆధిపత్య పోరుకు ఒకరు బలి

by  |
వైసీపీ ఆధిపత్య పోరుకు ఒకరు బలి
X

దిశ, అమరావతి బ్యూరో: గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం బలిజేపల్లికి చెందిన గుడారి సుబ్బారావు మృతి చెందాడు. వైకాపాలో ఆధిపత్య పోరులో భాగంగా నాలుగు రోజుల క్రితం సుబ్బారావుపై ప్రత్యర్థులు మారణాయుదాలతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన సుబ్బారావును జీజీహెచ్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. నేడు స్వగ్రామానికి మృతదేహాన్ని తరలించనున్నారు. అయితే అంత్యక్రియల సందర్భంగా మరోసారి దాడులు జరిగే అవకాశం ఉండడంతో గ్రామంలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు.

Next Story

Most Viewed