- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
లక్ష్మీ విలాస్ బ్యాంకుపై తాత్కాలిక మారటోరియం!

X
దిశ, వెబ్డెస్క్: ప్రైవేట్ రంగ లక్ష్మీ విలాస్ బ్యాంక్ ఖాతాదారులకు ఆర్బీఐ షాకింగ్ వార్తను అందించింది. గత మూడేళ్లుగా బ్యాంకు ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడం, స్థిరమైన క్షీణత నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) డిసెంబర్ 16 వరకు లక్ష్మీ విలాస్ బ్యాంకుపై తాత్కాలిక మారటోరియంను విధించింది. ఈ నిర్ణయంతో బ్యాంకు ఖాతాదారులు రూ. 25,000 మాత్రమే విత్డ్రా చేసుకునే వీలుంటుంది.
ఆర్బీఐ నిర్ణయం తక్షణమే అమ్మల్లోకి రావడంతో బ్యాంకు ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వ్యూహాత్మక ప్రణాళిక లేకపోవడం, నిరధక ఆస్తులు(ఎన్పీఏ) పెరగడం, పురోగతి క్షీణించడం వంటి కారణాల వల్లనే తాత్కాలిక మారటోరియం విధిస్తున్నట్టు ఆర్బీఐ వెల్లడించింది. వీటితోపాటు సవాళ్లను పరిష్కరించేందుకు అవసరమైన మూలధన సమీకరణలో బ్యాంకు పూర్తిగా విఫలమైందని ఆర్బీఐ తెలిపింది.
Next Story