బ‌స్సులో ప్రయాణించిన జెడ్పీ చైర్మ‌ెన్

by Sridhar Babu |
బ‌స్సులో ప్రయాణించిన జెడ్పీ చైర్మ‌ెన్
X

దిశ‌, ఖ‌మ్మం: ఖ‌మ్మం జిల్లా మ‌ధిర నియోజ‌క‌వ‌ర్గ కేంద్రంలోని ఆర్టీసీ బ‌స్‌స్టేష‌న్‌ను శుక్ర‌వారం జిల్లా ప‌రిష‌త్ చైర్మ‌ెన్ లింగాల క‌మ‌ల్‌రాజ్ సంద‌ర్శించారు. ప్రజా రవాణాకు ఎలాంటి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా చూడాల‌ని స్థానిక డీఎంతో సహా బ‌స్ స్టేష‌న్లో ఉన్న డ్రైవర్లకు, కండక్టర్లకు, సిబ్బందికి స్వ‌యంగా శానిటైజర్ల‌ను పంపిణీ చేశారు. అనంతరం ఆర్టీసీ బస్సులో టీఆర్ఎస్ నాయకులతో క‌లసి భౌతిక దూరం పాటిస్తూ ప్ర‌యాణం చేశారు. ఆయనతో పలువురు టీఆర్‌ఎస్ నాయకులు ప్రయాణించారు.

Advertisement

Next Story