వర్షాల గురించి వాతావరణశాఖ ఏం చెప్పిందంటే..?

by Shyam |
వర్షాల గురించి వాతావరణశాఖ ఏం చెప్పిందంటే..?
X

దిశ, వెబ్ డెస్క్: వాతావరణశాఖ ఓ ప్రకటన చేసింది. రాష్ట్రంలో నేడు, రేపు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొన్నది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొన్నది. రాగల మూడు రోజుల్లో తమిళనాడు అంతటా, కర్ణాటక, రాయలసీమ, కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని, ఈ కారణంగా వర్షాలు కురవనున్నాయని తెలిపింది.

Advertisement
Next Story