మూడు సార్లు కేసు నమోదైతే.. పీడీ యాక్ట్ తప్పదు

by  |
మూడు సార్లు కేసు నమోదైతే.. పీడీ యాక్ట్ తప్పదు
X

దిశ, హుస్నాబాద్: ప్రభుత్వం నిషేధించిన గుట్కాలు, అంబర్ ప్యాకెట్లు విక్రయించిన వారిపై మూడు సార్లు కేసులు నమోదైతే పీడీ యాక్టు కేసులు నమోదు చేస్తామని హుస్నాబాద్ ఏసీపీ మహేందర్ అన్నారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన మాట్లాడుతూ… హుస్నాబాద్ డివిజన్ పరిధిలోని 2018- 2020లో సంవత్సరాలకు గాను రూ.17,11,064 లక్షల విలువ గల గుట్కాలు, అంబార్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఇందులో మొత్తం 46 కేసులు నమోదు చేయగా 88 మందిని అరెస్టు చేసి జైలుకు పంపినట్టు ఆయన స్పష్టం చేశారు.

Next Story

Most Viewed