క్రికెట్ బెట్టింగ్ రాయుళ్లు అరెస్టు

by  |
క్రికెట్ బెట్టింగ్ రాయుళ్లు అరెస్టు
X

దిశ, తెలంగాణ క్రైమ్‌బ్యూరో: హైదరాబాద్‌లో మూడు వేర్వురు ప్రాంతాల్లో క్రికెట్‌ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఐదుగురిని అరెస్ట్ చేసి రూ.55వేల నగదు, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మెట్టుగూడ‌లో బెట్టింగ్‌కు పాల్పడుతున్న పోలపల్లి శివ శంకర్, నవీన్‌కుమార్‌ను నార్త్‌జోన్ పోలీసులు అరెస్టు చేశారు. రాజస్థాన్ నుంచి కేడీ ఆన్‌లైన్ బుకీ ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తుండగా వీరి నుంచి రూ.20 వేల నగదు, 2సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. బోరబండలో ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న మద్దూరి సుధాకర్‌‌ను అరెస్టు చేసి రూ.13వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. గోల్కొండ పీఎస్ పరిధిలో ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న సుశీల్ కుమార్, అనిల్ సింగ్‌లను అరెస్టు చేసి రూ.22వేల నగదు, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.



Next Story

Most Viewed