Tirumala Samacharam: తిరుమల వెళ్లే భక్తులకు భారీ గుడ్ న్యూస్.. నిరీక్షణ లేకుండా శ్రీవారి దర్శనం

by Shiva |
Tirumala Samacharam: తిరుమల వెళ్లే భక్తులకు భారీ గుడ్ న్యూస్.. నిరీక్షణ లేకుండా శ్రీవారి దర్శనం
X

దిశ, వెబ్‌డెస్క్: ఆపద మొక్కులవాడు శ్రీ వేంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమల (Tirumala)లో భక్తుల రద్దీ పూర్తిగా తగ్గింది. మంగళవారం శ్రీవారి దర్శనానికి జనం చాలా తక్కువ సంఖ్యలో తరలివచ్చారు. మరోవైపు వారాంతపు సెలవులు కూడా ముగియడంతో టోకెన్లు లేని భక్తులు, రూ.300 ప్రత్యేక దర్శన టోకెన్లు తీసుకున్న వారికి నేరుగా శ్రీవారి దర్శనం అవుతోంది. అదేవిధంగా బుధవారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ (Vaikuntam Que Complex) కూడా ఖాళీగా దర్శనమిస్తోంది. మంగళవారం స్వామి వారిని 67,616 మంది భక్తులు దర్శించుకోగా అందులో 22,759 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. తిరుమల శ్రీవారి హుండీ (Srivaari Hundi) ఆదాయం రూ.3.89 కోట్లు వచ్చాయని టీటీడీ అధికారులు తెలిపారు.

Next Story

Most Viewed