- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- ఎన్ఆర్ఐ - NRI
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
రోడ్డు ప్రమాదంలో తాత మృతి .. మనవడికి తీవ్ర గాయాలు..
దిశ,నిజాంసాగర్ : కామారెడ్డి జిల్లా కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న సంఘటనలో తాత మృతి చెందగా, మనవడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన సోమవారం మధ్యాహ్నం నిజాంసాగర్ మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామ శివారులోని NH- 161 జాతీయ రహదారిపై చోటుచేసుకుంది . గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం నిజాంసాగర్ మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన గారబోయిన లాలయ్య (65) అనే వ్యక్తి తన మనవడు జ్ఞాన్(22) తో కలిసి తమ టీవీఎస్ వాహనంపై పిట్లం మండల కేంద్రానికి వెళ్తున్నాడు .
ఇదే సమయంలో హైదరాబాద్ నుంచి బాన్సువాడ వైపు వెళ్తున్న టీఎస్ 17 జి 0345 నెంబర్ గల కారు అతివేగంగా వచ్చి లాలయ్య టీవీఎస్ వాహనాన్ని బలంగా ఢీకొట్టడంతో లాలయ్య అక్కడికక్కడే మృతి చెందగా, మనవడు జ్ఞాన్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. కాగా జాతీయ రహదారి కి సంబంధించిన 1033 అంబులెన్స్ లో సంగారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు గ్రామస్తులు తెలిపారు. లాలయ్య మృతి చెందిన విషయం తెలుసుకొని లాలయ్య భార్య ఘటన స్థలానికి వచ్చి భర్త మృతదేహం పై పడి బోరున విలపించింది . రోడ్డు ప్రమాదం జరిగిన విషయాన్ని తెలుసుకున్న నిజాంసాగర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపడుతున్నారు.