BREAKING: ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. చిన్నారితో సహా ముగ్గురికి తీవ్ర గాయాలు

by Shiva |
BREAKING: ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. చిన్నారితో సహా ముగ్గురికి తీవ్ర గాయాలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆటోను, లారీ ఢీకొట్టగా ముగ్గురికి తీవ్ర గాయాలైన ఘటన నిర్మల్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. భైంసా పట్టణంలోని సంతోషి మాత ఆలయం వద్ద భైంసా నుంచి నిర్మల్ వైపు ఆర్టీసీ బస్సు వెళ్తోంది. ఈ క్రమంలోనే రోడ్డు క్రాస్ చేస్తున్న ఆటోను బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో ఉన్న చిన్నారితో సహా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు ముగ్గురిని చికిత్స నిమిత్తం భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed