Arrest: గుంటూరులో దారుణం.. సైనేడ్‌తో చంపేస్తున్న లేడీ కిల్లర్స్ అరెస్ట్

by Shiva |
Arrest: గుంటూరులో దారుణం.. సైనేడ్‌తో చంపేస్తున్న లేడీ కిల్లర్స్ అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ రోజుల్లో ఎవరైనా కష్టాల్లో ఉంటే.. వారికి అప్పు ఇచ్చి ఆదుకునే వాడు వారి పాలిట ఆపద్భాంధవుడు అవుతాడు. చేసిన సాయాన్ని మర్చిపోకుండా ఇచ్చిన అప్పును ఎలాగైన తీర్చి వారి రుణం తీర్చుకోవాలని రుణగ్రస్తులు భావించడం రొటీన్. కానీ, అప్పులు చేసిన కి‘లేడీ’లు చేసిన పనికి పోలీసులకే దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయిన ఘటన గుంటూరు జిల్లాలో (Guntur District) చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పట్టణంలో మగ్గురు మహిళలు తాము కష్టాల నుంచి బయట పడేందుకు తెలిసిన వారి దగ్గర అప్పు తీసుకున్నారు.

అయితే, కొన్నాళ్లు గడిచాక తీసుకున్న అప్పు తిరిగి చెల్లించాలంటూ అప్పులోల్లు మహిళల నిలదీశారు. దీంతో మహిళలు అప్పులు ఎగ్గొట్టేందుకు పెద్ద స్కెచ్చే వేశారు. అప్పులోల్లు ఇంటికి రాగానే టీ, కాఫీలు ఇచ్చి అందులో సైనేడ్ కలిపి సైలెంట్‌గా చంపేయడం స్టార్ట్ చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు గత జూన్ నెలలో ఓ మహిళ హత్య కేసులో విచారణ చేపట్టిన పోలీసులకు కేసులో లీడ్ దొరికింది. ఇప్పటికి సెనైడ్ ప్రయోగించి ఆ ముగ్గురు మహిళలు నలుగురిని చంపినట్లుగా నిర్ధారణ అయింది. అదేవిధంగా మరో ముగ్గురిపై హత్యాయత్నం చేసినట్లుగా తేలింది. దీంతో పక్కా ప్లాన్‌తో రంగంలోకి దిగిన పోలీసులు ముగ్గురు మహిళలను, సైనేడ్ విక్రయించిన వ్యక్తిని కూడా అరెస్ట్ చేసినట్లుగా ఎస్పీ సతీష్ (SP Sathish) తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed