పురుగుల మందు సేవించి యువకుడి ఆత్మహత్య..

by Kalyani |
పురుగుల మందు సేవించి యువకుడి ఆత్మహత్య..
X

దిశ, రాయపర్తి: పురుగుల మందు సేవించి యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని పన్యానాయక్ తండా గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. మృతుని బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. పన్యానాయక్ తండాకు చెందిన భూక్య మధు (28) హైదరాబాద్ లో ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో దసరా పండుగ కోసం కుటుంబంతో కలిసి ఇంటికి వచ్చిన మధు గురువారం ఉదయం తన వ్యవసాయ పొలంలో పురుగుల మందు తాగి బలవన్మరణానికి యత్నించినట్లు చెప్పారు. గమనించిన కుటుంబ సభ్యులు మధును చికిత్స నిమిత్తం తొర్రూరు లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అక్కడి వైద్యుల సిఫార్సు మేరకు వరంగల్ లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కాగా శుక్రవారం ఉదయం పరిస్థితి విషమించి మధు మృతి చెందినట్లు వివరించారు. మృతుడికి భార్య అఖిల తో పాటు, కుమారుడు, కుమార్తె ఉన్నారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా మధు ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story