ఇద్దరు చైన్​స్నాచర్లు అరెస్ట్

by Sridhar Babu |
ఇద్దరు చైన్​స్నాచర్లు  అరెస్ట్
X

దిశ, చెన్నూర్ : ఇద్దరు చైన్​స్నాచర్లను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గత నెల 23వ తేదీన పద్మశాలి కాలనీకి చెందిన వృద్ధురాలు రాజుబాయి శివాలయం నుంచి ఇంటికి వస్తుండగా పద్మశాలి కాలనీ ప్రాంతంలో పట్టణానికి చెందిన దుండగులు నేన్నెల సూర్య, జిట్టబోయిన సంతోష్ వెంబడించి ఆమె మెడలోని రెండున్నర తులాల బంగారు గొలుసు గుంజుకొని పారిపోయారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు దర్యాప్తు చేస్తుండగా సోమవారం రాజీవ్ రోడ్డులో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులను చూసి ఇద్దరు అనుమానితులు ద్విచక్ర వాహనంపై పారిపోయేందుకు ప్రయత్నించారు.

దాంతో వారిని అదుపులోకి తీసుకొని విచారించగా వారి వద్ద నుండి రెండున్నర తులాల బంగారు గొలుసు లభ్యమైంది. కేసు నమోదు చేసుకొని నిందితులను స్థానిక మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచి రిమాండ్ కు తరలించినట్లు పట్టణ సీఐ రవీందర్ తెలిపారు. దొంగతనానికి ఉపయోగించిన ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. నిందితులను అరెస్టు చేయడంలో చాకచక్యంగా వ్యవహరించిన పట్టణ సీఐ రవీందర్, ఎస్ఐ శ్వేత, సిబ్బంది భూమన్న, ఖదీర్ లను పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు.

Advertisement

Next Story

Most Viewed