ఆటోలో తరలిస్తున్న గంజాయి పట్టివేత..

by Aamani |
ఆటోలో తరలిస్తున్న గంజాయి పట్టివేత..
X

దిశ,రాంనగర్: ముషీరాబాద్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గాంధీ హాస్పిటల్ మెట్రో స్టేషన్ దగ్గర ఆటోలో గంజాయిని అక్రమంగా తరలిస్తున్నారని సమాచారం మేరకు రంగారెడ్డి ఎన్ ఫోర్స్ సీఐ చంద్రశేఖర్ గౌడ్ టీం సభ్యులు కలిసి గంజాయిని పట్టుకున్నారు.1.200 కేజీల గంజాయి తో పాటు రెండు మొబైల్ లను ఒక ఆటోను కూడా సీజ్ చేశారు.ఈ కేసులో ఎండి సమీర్, కుశాల్ లను అరెస్ట్ చేశారు. మూడో వ్యక్తిగా ఎండి అహ్మద్ పై కూడా కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.గంజాయిని నిందితులను ఆటోను ముషీరాబాద్ ఎక్సైజ్ స్టేషన్ లో అప్పగించారు.గంజాయిని పట్టుకున్నటువంటి ఎన్ ఫోర్స్ టీమును డిప్యూటీ కమిషనర్ దశరథ్ అసిస్టెంట్ కమిషనర్ ఆర్ కిషన్ అభినందించారు.



Next Story

Most Viewed