నిజాం సాగర్ కెనాల్‌లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం..

by Aamani |
నిజాం సాగర్ కెనాల్‌లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం..
X

దిశ,ఆర్మూర్ : ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని టీచర్స్ కాలనీ ఏరియా లోని నిజాం సాగర్ కెనాల్ లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభించింది. ఆ వ్యక్తి వయస్సు సుమారు 35 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉంటుంది. మృతుని ఒంటిపై నలుపు రంగు ఆఫ్ హాండ్స్ టీషర్ట్, సిమెంట్ రంగు నైట్ ప్యాంటు ఉన్నాయి. ఈ గుర్తు తెలియని మగ వ్యక్తి మృతదేహం ఆచూకీ వివరాలు తెలిసినవారు ఆర్మూర్ పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వాలని ఆర్మూర్ ఎస్ హెచ్ ఓ సత్యనారాయణ గౌడ్, ఎస్సైలు ఇంద్రకరణ్ రెడ్డి, గోవింద్, మహేష్ లు తెలిపారు.

Advertisement
Next Story