చెరువులో గుర్తు తెలియని మృతదేహం లభ్యం

by Kalyani |   ( Updated:2024-10-06 09:49:22.0  )
చెరువులో గుర్తు తెలియని మృతదేహం లభ్యం
X

దిశ, జమ్మికుంట: చెరువులో గుర్తు తెలియని మృతదేహం లభ్యం అయిన సంఘటన కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం బూజునూరు గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తుల, పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు బతుకమ్మ కుంట సమీపంలో వెళ్తుండగా గుర్తు తెలియని మృతదేహం నీటిలో తేలియాడుతూ కనిపించింది. ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించగా, మృతదేహాన్ని బయటకు తీసి జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహం ఆనవాళ్లను చూస్తుంటే, రెండు, మూడు రోజుల క్రితమే చెరువులో పడి మృతి చెందినట్లుగా భావిస్తున్నారు. కాగా గుర్తు తెలియని మృతదేహం పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రమాదవశాత్తు జరిగిందా, ఎవరైనా హత్య చేసి చెరువులో పడవేశారా అనే చర్చ కొనసాగుతోంది. కాగా మృతిని వయస్సు 35-45 మధ్య ఉంటుందని, చామన చాయ రంగులో ఉందని, కుడి చేతికి స్టీల్ కడెం, బ్లూ కలర్ ఫుల్ టీ షర్ట్ ధరించి ఉన్నాడని ఇల్లందకుంట ఎస్ఐ రాజ్ కుమార్ తెలిపారు. మృతుని వివరాలు తెలిస్తే 8712670778 నంబర్ కు సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు.

Advertisement

Next Story