అమ్మవారి ఆభరణాలు మాయం

by Sridhar Babu |
అమ్మవారి ఆభరణాలు మాయం
X

దిశ,మణుగూరు : ముత్యాలమ్మ గుడిలో దొంగలు పడ్డారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం సమితి సింగారం గ్రామ పంచాయతీలో చోటు చేసుకుంది. గ్రామపంచాయతీ కార్యాలయం ముందు ఉన్న ముత్యాలమ్మ గుడిలో సోమవారం దొంగతనం జరిగిందని గ్రామస్తులు తెలిపారు. రాత్రి సమయంలో గుర్తు తెలియని దుండగులు గుడిలోకి చొరబడి అమ్మవారి ఆభరణాలు దొంగిలించి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

అమ్మవారి వెండి కండ్లు, వెండి ఆభరణాలు, గుడి పూజా సామాన్లు మాయం చేశారని తెలిపారు. పంచాయతీ కార్యాలయం పరిధిలో స్థానిక పోలీసులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినా అవి పని చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పోలీసులు స్పందించి అమ్మవారి ఆభరణాలు రికవరీ చేసి గుడికి అప్పగించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ విషయంపై పోలీసుల వివరణ కోరగా ముత్యాలమ్మ గుడిలో దొంగతనం జరిగిన విషయం తమ దృష్టికి రాలేదన్నారు.

Advertisement

Next Story