గుర్తుతెలియని వాహనం ఢీ... వ్యక్తి మృతి

by Sumithra |
గుర్తుతెలియని వాహనం ఢీ... వ్యక్తి మృతి
X

దిశ, ఆమనగల్లు : ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధి విటయిపల్లి శివారు చైత్ర మెస్ సమీపంలో ద్విచక్రవాహనం పై వెళ్తున్న బాసుపల్లి మాణిక్ రెడ్డిని గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఆమనగల్లు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ లోని సైదాబాద్ వినయ్ నగర్ కాలనీలో నివాసం ఉంటున్న మాణిక్ రెడ్డి కల్వకుర్తిలోని తన వ్యవసాయ పొలానికి శుక్రవారం వెళ్లి, శనివారం మధ్యాహ్నం ద్విచక్రవాహనంపై తిరుగు ప్రయాణమయ్యారు.

మార్గమధ్యంలో విటయిపల్లి శివారులో గుర్తితెలియని వాహనం ఢీకొనగా, తలకు బలమైన గాయం తగిలి అక్కడికక్కడే మృతి చెందినట్లు పేర్కొన్నారు. మృతుని కుమారుడు అభిజిత్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed