విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయురాలి ఆత్మహత్య..

by Sumithra |
విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయురాలి ఆత్మహత్య..
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : పిల్లలకు విద్యాబుద్దులు నేర్పించాల్సిన ఉపాధ్యాయురాలు ఆత్మహత్యకు పాల్పడిన విషాదకర సంఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం కొత్తబాది ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో హిందీ టీచర్ గా విధులు నిర్వహిస్తున్న ప్రమీల అనే ఉపాధ్యాయురాలు గురువారం ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. గత కొన్నేళ్లుగా ఆమె క్యాన్సర్ తో బాధపడుతున్నట్లు సమాచారం. తనకు క్యాన్సర్ ఉందని తెలిసినప్పటి నుంచి ప్రమీల మానసికంగా కృంగిపోయి జీవితం పై విరక్తి పెంచుకున్నట్లు తెలుస్తోంది. భర్త రవీంద్రనాయక్ నాగిరెడ్డిపేట్ మండలంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed