కామారెడ్డిలో మరో కరోనా మరణం

by  |
కామారెడ్డిలో మరో కరోనా మరణం
X

దిశ, వెబ్ డెస్క్: కామారెడ్డిలో మరో కరోనా మరణం సంభవించింది. జిల్లాలోని ఏరియా ఆస్పత్రిలో కరోనా లక్షణాలతో చికిత్స పొందుతూ ఓ వ్యక్తి ఆదివారం ప్రాణాలు కోల్పోయాడు. ఈ నెల 17న ఆర్టీసీ బస్టాండ్ వద్ద తీవ్ర అనారోగ్యంతో నరకయాతన అనుభవిస్తున్న హనుమంతు అనే వ్యక్తిని 108 ద్వారా ఆర్టీసీ అధికారులు ఏరియా ఆస్పత్రికి తరలించారు. రెండ్రోజులుగా కరోనాతో పోరాడుతూ.. చికిత్స పొందుతున్న ఆ వ్యక్తి పరిస్థితి విషమించి ప్రాణాలు వదిలాడు. అయితే, మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు బంధువులు నిరాకరించడంతో మున్సిపల్ సిబ్బంది దహన సంస్కారం నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, జిల్లాలో కరోనా కేసులు, మరణాల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.


Next Story

Most Viewed