ఎమ్మెల్యే ముత్తిరెడ్డితోపాటు మరో నలుగురికి కరోనా.. వారెవరెవరంటే..?

by vinod kumar |
ఎమ్మెల్యే ముత్తిరెడ్డితోపాటు మరో నలుగురికి కరోనా.. వారెవరెవరంటే..?
X

దిశ, వరంగల్: జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డితోపాటు మరో నలుగురికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఎమ్మెల్యే సతీమణి పద్మ లతారెడ్డితోపాటు ఎమ్మెల్యే డ్రైవర్, గన్ మెన్, వంట మనిషికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యిందని వైద్యులు తెలిపారు. తమకు కరోనా పాజిటివ్ అయినప్పటికీ ఆరోగ్యంగానే ఉన్నామని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి సతీమణి పద్మ లతారెడ్డి మీడియాకు వెల్లడించారు. పాజిటివ్ వచ్చిన నలుగురిని హోమ్ క్వారంటైన్ లో ఉండాల్సిందిగా వైద్యులు సూచించారని, జనగామ నియోజక వర్గ ప్రజలు, నాయకులు, టీఆరెస్ కార్యకర్తలు ఆందోళన చెందొద్దని ఆమె కోరారు.

Advertisement

Next Story

Most Viewed