పోలవరం నిధుల కోసం పోరాడతాం : శైలజానాథ్

by Anukaran |   ( Updated:2020-10-30 10:31:25.0  )
PCC Chief Sailajanath
X

దిశ, ఏపీబ్యూరో: పోలవరం ప్రాజెక్టు తాజా అంచనాల ప్రకారం నిధులు రాబట్టేందుకు కేంద్రంపై అన్ని పక్షాలను కలుపుకొని పోరాడతామని పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్​ అన్నారు. శుక్రవారం అనంతపురంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పోలవరంపై కేంద్రం దగా చేస్తుంటే సీఎం జగన్​ నిమ్మకు నీరెత్తినట్లున్నారని చెప్పారు. ఇదేదో సొంతింటి వ్యవహారంలో పాలన సాగుతుందన్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో విధ్వంసకర రాజకీయాలు కొనసాగుతున్నాయని విమర్శించారు. రైతుల వ్యతిరేక పాలన సాగుతోందన్నారు ఆవేదన వ్యక్తం చేశారు. విలేకరుల సమావేశంలో పీసీసీ మాజీ అధ్యక్షుడు తులసిరెడ్డి మాట్లాడారు.

Advertisement

Next Story

Most Viewed