- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
గొడవల వల్ల వరుణ్ తేజ్-లావణ్య షాకింగ్ నిర్ణయం.. ఇక నుంచి మెగా ఫ్యామిలీకి దూరంగా ఉండనున్నారా?
దిశ, సినిమా: యంగ్ బ్యూటీ లావణ్య త్రిపాఠి మెగా హీరో వరుణ్ తేజ్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇక అప్పటి నుంచి వరుణ్ తేజ్ వరుస చిత్రాల్లో నటిస్తూ దూసుకెళ్తున్నాడు. కానీ లావణ్య త్రిపాఠి మాత్రం సినిమాలకు కాస్త దూరంగా ఉంటుంది. పెళ్లైన తర్వాత మిస్ ఫర్ఫెక్ట్ వెబ్ సిరీస్తో ప్రేక్షకులను మెప్పించింది. ఆ తర్వాత ఏ ప్రాజెక్ట్ ఒప్పుకోకుండా.. వరుణ్ తేజ్తో వెకేషన్స్కు వెళ్తూ ఎంజాయ్ చేస్తుంది. ఆ ఫొటోలను, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, వరుణ్ తేజ్-లావణ్య ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ కొత్త జంట ఓ కొత్త ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేయబోతున్నట్లు సమాచారం.
వీరిద్దరు అనుకుని కొణిదెల పేరుతో బ్యానర్ ప్రారంభించబోతుండటం గమనార్హం. అయితే మెగా ఫ్యామిలీలో ఇప్పటికే కొణిదెల బ్యానర్ ఉంది. అలాగే నాగబాబు కూతురు నిహారిక ఇటీవల పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ అని ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు వరుణ్-లావణ్య కలిసి కొణిదెల బ్యానర్ మొదలెడుతుండటం నెట్టింట హాట్ టాపిక్గా మారింది. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ఈ విషయం తెలిసిన మెగా హేటర్స్ మాత్రం ఒకే ఫ్యామిలీలో రెండు బ్యానర్లు ఎందుకు పెడుతున్నారు.
మెగా ఫ్యామిలీకి దూరంగా ఉండి సినిమాలు తెరకెక్కిస్తారా? లేక ఏదైనా కారణం ఉందా? అని పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మాత్రం భార్యభర్తలు మంచి నిర్ణయం తీసుకున్నారని వారికి సపోర్ట్గా నిలుస్తున్నారు. వరుణ్-లావణ్య నిర్ణయం వల్ల మొత్తానికి మెగా ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్నట్లు నెట్టింట వార్తలు జోరందుకున్నాయి. కానీ దీనిపై ఎలాంటి ప్రకటన లేదు. అయితే ఈ వార్తలన్నింటికీ మెగా ఫ్యాన్స్ కొట్టిపారేస్తూ వాటిల్లో నిజం లేదని అంటున్నారు.