కొత్త ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్‌ను ప్రకటించిన ‘తండేల్’ మూవీ టీమ్.. పోస్ట్ వైరల్

by Kavitha |   ( Updated:2025-02-03 11:33:56.0  )
కొత్త ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్‌ను ప్రకటించిన ‘తండేల్’ మూవీ టీమ్.. పోస్ట్ వైరల్
X

దిశ, సినిమా: అక్కినేని నాగచైతన్య(Akkineni Naga Chaitanya), నేచురల్ బ్యూటీ సాయి పల్లవి(Sai Pallavi) జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘తండేల్’(Thandel). చందు మొండేటి(Chandu Mondeti) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని.. అల్లు అరవింద్(allu Aravind) సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు(Bunny Vasu) నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రం లవర్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇక విడుదల తేదీ దగ్గర పడడంతో మూవీ టీమ్ ప్రమోషన్ల జోరు పెంచింది.

ఇందులో భాగంగా తాజాగా ఓ లేటెస్ట్ అప్డేట్‌ను ఇచ్చారు మేకర్స్. ఈ మేరకు సోషల్ మీడియా(Social Media) వేదికగా తాండేల్ జాతర(Thandel Jathara) అనే పేరుతో.. ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్‌ను అనౌన్స్ చేశారు. అయితే దీనికి ముఖ్య అతిథిగా అల్లు అర్జున్(Allu Arjun) రాబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే మూవీ టీమ్ బహిరంగా కార్యక్రమానికి అనుమతి పొందగా ఈ ఈవెంట్‌ను అన్నపూర్ణ స్టూడియో(Annapurna Studio)లోని 7 ఎకరాల్లో ఇంటి లోపల ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

కాగా ఈ ఈవెంట్ ఫిబ్రవరి 1న అనగా నేడు జరగాల్సి ఉండగా కొన్ని అనివార్య కారణాల వల్ల రేపటికి పోస్ట్ ఫోన్ చేశారు. ఈ మేరకు అధికారికంగా ప్రకటిస్తూ.. ‘ఈ రోజు జరగాల్సిన ఐకానిక్ తాండేల్ జాతర ఫిబ్రవరి 2కి మార్చబడింది. ఈవెంట్‌ చాలా మరపురాని క్షణాలతో, గొప్పగా వైభవంగా ఉండబోతుంది. ఈసారి గురి తప్పేదేలే’ అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


Click Here Tweet..

Next Story