డీప్ ఫేక్ బారిన పడిన దీపికా పదుకొనే, తన గారాల పట్టి.. నెట్టింట వైరల్ అవుతున్న ఫొటోలు

by Kavitha |
డీప్ ఫేక్ బారిన పడిన దీపికా పదుకొనే, తన గారాల పట్టి.. నెట్టింట వైరల్ అవుతున్న ఫొటోలు
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే అందరికీ సుపరిచితమే. ఈ బ్యూటీ 2018లో బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్‌ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ జంట మ్యారేజ్ అయిన 4ఇయర్స్‌కు ఈ ఏడాది ఫిబ్రవరిలో తాము తల్లి తండ్రులు కాబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అయితే రీసెంట్‌గా ఈ అమ్మడు పండంటి ఆడబిడ్డకు జన్మినిచ్చింది. ఈ విషయం స్వయంగా రణవీర్ సింగ్, దీపికాలు ఇన్‌స్టా వేదికగా వెల్లడించారు. దీంతో అభిమానులు, సెలబ్రిటీలు మరియు స్నేహితులు వీరికి శుభాకాంక్షలు తెలిపారు.

అయితే, బేబీ ఫొటోలను దీపిక దంపతులు ఎక్కడా కూడా రివీల్ చేయలేదు. ఈ రోజుల్లో తమ పిల్లలకు సంబంధించిన ప్రైవసీని సెలబ్రిటీలు చాలా గోప్యంగా ఉంచుతున్నారనే సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నెట్టింట దీపిక ఆస్పత్రి బెడ్ మీద పడుకొని తన గుండె మీద బేబీని పట్టుకుని పడుకుని ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక ఫోటోలో బేబీ ఫేస్ మొత్తం రివీల్ చేసినట్లు ఉంది. అయితే, అవి నిజమైన ఫోటోలు కావని.. డీప్ ఫేక్ ఫోటోలు అని తెలిసిపోయింది. కొందరు పాపులారిటీ కోసం, వ్యూస్ కోసం ఏఐ సాయంతో ఇలాంటి డీప్ ఫేక్ చేస్తున్నారని నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తుంది.

Advertisement

Next Story

Most Viewed