కుక్కల దాడిలో చిన్నారి మృతి

by  |

అమరావతి: గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. వీధి కుక్కల దాడిలో మూడేళ్ల బాలిక మృతి చెందింది. ఈ ఘటన మాచవరం మండలం పిన్నెల్లిలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. షేక్ షాపూర(3) అనే చిన్నారి మరో పాపతో కలిసి ఇంటి సమీపంలో ఆడుకుంటుండగా.. అక్కడే ఉన్న నాలుగు కుక్కలు ఒక్కసారిగా చిన్నారిపై దాడి చేశాయి. ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. అభం శుభం ఎరుగని చిన్నారి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Tags: children dead, dog, attack, machavaram, guntur, ap



Next Story

Most Viewed