- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
2000 నోట్లు మార్పిడిపై ఆర్బీఐ కీలక ప్రకటన.. మార్పిడి, డిపాజిట్ కి ఆఖరి తేదీ ఇదే..

దిశ, ప్రతినిధి: ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సెంట్రల్ బ్యాంకుకు సంబంధించిన 19 కార్యాలయాల్లో రూ. 2000 నోట్ల మార్పిడి, డిపాజిట్ సౌకర్యం అందుబాటులో ఉన్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఆర్థిక ఏడాది ముగుస్తున్న క్రమంలో అకౌంట్లు క్లోజింగ్ కోసం ఏప్రిల్ 1న రూ/ 2000 నోట్లకు సంబంధించిన సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తెలిపింది. కాగా ఈ సేవలు తిరిగి ఏప్రిల్ 2 నుంచి పునః ప్రారంభం కానున్నాయని ఆర్బీఐ అధికారికంగా ప్రకటించింది.
ఇక మే 19, 2023 నుండి రిజర్వ్ బ్యాంకుకు చెంది ఇష్యూ కార్యాలయాల్లో రూ.2000 నోట్ల మార్పిడి సౌకర్యం అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే.. కాగా ఇప్పటికే రూ.2,000 కరెన్సీ నోట్లలో 97.62 శాతం బ్యాంకింగ్ వ్యవస్థకు తిరిగి వచ్చినట్లు ఆర్బీఐ తెలిపింది. మిగిలిన నోట్ల రికవరీ కోసం నోట్ల మార్పు వ్యవధిని పొడింగించిన ఆర్బీఐ.. ఆర్ధిక సంవత్సరం ముగియనుండడంతో ఏప్రిల్ 1న రూ/ 2000 నోట్లకు సంబంధించిన సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తెలిపింది.