Stock Market: అధిక లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

by S Gopi |
Stock Market: అధిక లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మార్కెట్లు లాభాలు సాధించాయి. అంతకుముందు సెషన్‌లో తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్న సూచీలు మంగళవారం ట్రేడింగ్‌లో అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మద్దతు లభించడం, కీలక బ్యాంకింగ్, ఐటీ రంగ షేర్లలో కొనుగోళ్ల జోరు మదుపర్ల సెంటిమెంట్‌ను పెంచాయి. ప్రధానంగా అమెరికా ఫెడ్ నుంచి వడ్డీ రేట్లను తగ్గించవచ్చనే సంకేతాలివ్వడంతో గ్లోబల్ మార్కెట్లు రాణించాయి. దీనికితోడు దేశీయ ఈక్విటీల్లో రిటైల్ ఇన్వెస్టర్లు పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తుండటంతో లాభాలు పెరిగాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 378.18 పాయింట్లు పుంజుకుని 80,802 వద్ద, నిఫ్టీ 126.20 పాయింట్ల లాభంతో 24,698 వద్ద ముగిశాయి. నిఫ్టీలో బ్యాంకింగ్, ఫైనాన్స్, ఐటీ రంగాలు రాణించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో బజాజ్ ఫిన్‌సర్వ్, ఇండస్ఇండ్ బ్యాంక్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, కోటక్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, సన్‌ఫార్మా షేర్లు 1 శాతానికి పైగా పెరిగాయి. భారతీ ఎయిర్‌టెల్, ఐటీసీ, అదానీ పోర్ట్స్, టాటా మోటార్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.79 వద్ద ఉంది.

Advertisement

Next Story

Most Viewed