ఎమ్మెల్యే ఫోన్ హ్యాక్... ఆస్ట్రేలియా వ్యక్తులపై ఎస్పీకి ఫిర్యాదు

by srinivas |   ( Updated:2024-01-08 16:33:03.0  )
ఎమ్మెల్యే ఫోన్ హ్యాక్... ఆస్ట్రేలియా వ్యక్తులపై ఎస్పీకి ఫిర్యాదు
X

దిశ, కడప: తన ఫోన్‌ను ఎవరో హ్యాక్ చేసారని, అయితే ఆస్ట్రేలియాకు చెందిన వారని తనకు అనుమానం ఉందని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. ఈ మేరకు వారిపై జిల్లా ఎస్పీ సిద్దార్థ కౌశల్‌కు ఫిర్యాదు చేశారు. అయితే వారికి 50 లక్షల రూపాయలు డబ్బులు కూడా ముట్టినట్లు పేర్కొన్నారు. తనకు శత్రువులు ఉన్నారంటే అది టీడీపీ వారేనని ఎమ్మెల్యే రాచమల్లు ఆరోపించారు.

నాలుగేళ్ళ కితం సీఆర్‌సీకి తెలియదా..!

ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్య వైసీపీ గుడ్ బై చెప్పడంపై ఎమ్మెల్యే రాచమల్లు స్పందించారు. నాలుగేళ్ళ కిందట వైసీపీ గురించి రామచంద్రయ్యకు తెలియదా అని ప్రశ్నించారు. ఇప్పుడు అరాచక పాలన అనడం హేయనియమని విమర్శించారు. టీడీపీ అధికారంలోకి వస్తుందని రామచంద్రయ్య పార్టీ మారారని, రాబోయే ఎన్నికల్లో వైసీపీ 130 స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తంచేశారు. షర్మిల కాంగ్రెస్‌లో చేరితే వైసీపీకి ఎటువంటి నష్టంలేదని రాచమల్లు పేర్కొన్నారు.

Advertisement

Next Story