Tirumala:కంపార్టుమెంట్‌లు దాటి MBC వరకు వేచి ఉన్న భక్తులు.. దర్శనానికి సమయం ఎంతంటే?

by Jakkula Mamatha |
Tirumala:కంపార్టుమెంట్‌లు దాటి MBC వరకు వేచి ఉన్న భక్తులు.. దర్శనానికి సమయం ఎంతంటే?
X

దిశ,వెబ్‌డెస్క్: కలియుగ దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు తరలి వస్తారు. ఈ క్రమంలో తిరుమల కొండపై భక్తుల రద్దీ నెలకొంటుంది. ఈ నేపథ్యంలో నేడు(ఆదివారం) శ్రీవారి దర్శనం కోసం కంపార్టుమెంట్‌లు దాటి MBC వరకు భక్తులు వేచి ఉన్నారు. శ్రీ వేంకటేశ్వర స్వామి వారి సర్వదర్శనానికి 18-20 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. ఇక నిన్న(శనివారం) శ్రీవారిని 72,923 మంది భక్తులు దర్శించుకున్నారు. 35,571 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.33 కోట్లు సమకూరిందని టీటీడీ అధికారులు పేర్కొన్నారు.

Next Story

Most Viewed