- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
ఆ బీచ్లో అల్లకల్లోలం.. వంద మీటర్లు ముందుకొచ్చిన సముద్రం
X
దిశ, ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం తీర ప్రాంతంలో తుఫాన్ ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్లో సముద్రం సుమారు 100మీటర్ల మేర ముందుకు చొచ్చుకు వచ్చింది. దీంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఇటు చిన్నమైనవాని లంక, పెదమైనవాని లంక, కెపి పాలెం గ్రామాల వద్ద సముద్రం ముందుకు చొచ్చుకు రావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అనేక లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ప్రభుత్వ హెచ్చరికతో సముద్రంలో వేటకు వెళ్లిన బోట్లన్నీ తీరానికి చేరుకున్నాయి.
Advertisement
Next Story