వివేకా వ్యక్తిగత జీవితాన్ని బయటపెట్టి అవమానిస్తున్నారు: వైఎస్ సునీత

by Disha Web Desk 18 |
వివేకా వ్యక్తిగత జీవితాన్ని బయటపెట్టి అవమానిస్తున్నారు: వైఎస్ సునీత
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో అన్ని పార్టీలు ప్రచారం జోరు పెంచుతున్నాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి, పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు మద్దతుగా వైఎస్ సునీత పులివెందులలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ సునీత ప్రజలతో మాట్లాడుతూ..మాజీ మంత్రి వివేకానందరెడ్డి నలభై ఏళ్లుగా ఈ ప్రాంతానికి సేవ చేశారని ఆయన కుమార్తె సునీత అన్నారు. వివేకాను అత్యంత దారుణంగా హతమార్చారు అని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం కోసం తాము పోరాడుతున్నామని..షర్మిలను గెలిపించాలని నియోజకవర్గ ప్రజలను ఆమె కోరారు.

ప్రజల కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయని, అందరిలోనూ చెప్పుకోలేని బాధ ఉందని అన్నారు. పులివెందుల ప్రజలతో పాటు నేను కూడా బాధపడుతున్న అని చెప్పింది. ఈ బాధకు ముగింపు మే 13 చెప్పాలని నియోజకవర్గ ప్రజలను కోరారు. వివేకానంద రెడ్డిని దారుణంగా చంపించిన వారిని ఓడించాలని ప్రజలే వారికి బుద్ధి చెప్పాలన్నారు. అంతే కాకుండా కొందరు ఆయన వ్యక్తిగత జీవితాన్ని బయటపెట్టి అవమానిస్తున్నారని మండిపడ్డారు. అటువంటివారికి ఈ ఎన్నికల్లో ప్రజలే ఓట్ల రూపంలో బుద్ధి చెప్పాలన్నారు.

Next Story

Most Viewed