Ramapuram: బీచ్‌లో విషాదం.. ముగ్గురు మృతి

by srinivas |
Ramapuram: బీచ్‌లో విషాదం.. ముగ్గురు మృతి
X

దిశ, వెబ్ డెస్క్: బాపట్ల జిల్లా చీరాల మండలం రామాపురం బీచ్‌లో విషాదం చోటు చేసుకుంది. సముద్రంలో స్నానానికి వెళ్లి నలుగురు విద్యార్థులో ముగ్గురు మృతి చెందారు. మరో విద్యార్థి గల్లంతయ్యారు. దీంతో విద్యార్థి కోసం గాలిస్తున్నారు. మృతులు నితిన్, అమలరాజు, తేజగా గుర్తించారు. గల్లంతైన విద్యార్థి కిషోర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు, మెరైన్ పోలీసులు ఘటనకు సంబంధించిన వివరాలను సేకరించారు. మృతుల కుటుంబాలకు సమాచారం అందజేశారు. ముగ్గురు విద్యార్థుల మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. ఆస్పత్రి వద్ద మృతుల కుటుంబాల రోదనలు మిన్నంటాయి. ఈ దృశ్యాలు చూసిన స్థానికులు సైతం కంటతడి పెట్టుకున్నారు. చిన్న వయసులో ప్రాణాలు పోగొట్టుకోవడంతో వారి గ్రామంలోనూ విషాదఛాయలు అలుముకున్నాయి.



Next Story