ఆ గ్రామంలో గత 20 రోజులుగా నీళ్లు వదలడం లేదు..

by Ramesh N |
ఆ గ్రామంలో గత 20 రోజులుగా నీళ్లు వదలడం లేదు..
X

దిశ, డైనమిక్ బ్యూరో: వేసవికాలం వచ్చిందంటే కొన్ని గ్రామాల్లో తాగునీటి సమస్య ఇప్పటికీ ఏర్పడుతుంది. అయితే ఇంకా ఎండాకాలం రాకముందే తాజాగా తాగునీటి కష్టాలు మొదలైనాయి. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో తాజాగా ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి. కర్నూలు జిల్లా ఆలూరు మండలం కురుకుంద గ్రామ ప్రజలకు తప్పని నీటి కష్టాలు మొదలైనాయని, గ్రామంలో గత 20 రోజుల నుంచి ట్యాప్ నీరు వదలడం లేదని ఆరోపణలు వస్తున్నాయి.

ఈ వ్యవహారంపై అధికారుల దృష్టికి గ్రామ ప్రజలు తీసుకెళ్లినా ఫలితం శూన్యమని ప్రచారం జరుగుతోంది. గ్రామంలో ఉన్న ఓ బోరింగ్ వద్దకు ప్రజలు వచ్చి నీళ్లు నింపుకొని పోతున్నారు. రిక్షాలు లాంటివి ఏర్పాటు చేసుకోని, వాటిపై బిందేలు తీసుకపోతున్న ఫోటోలు వైరల్‌గా మారాయి. ఈ నేపథ్యంలోనే ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వంపై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

Next Story

Most Viewed