లోకేష్ ‘శంఖారావం’ యాత్ర మొదలైంది.. తరలివచ్చిన పసుపుదళం

by Ramesh N |
లోకేష్ ‘శంఖారావం’ యాత్ర మొదలైంది.. తరలివచ్చిన పసుపుదళం
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ ప్రచారాల స్పీడ్ మరింత పెంచింది. ఈ నేపథ్యంలోనే యువనేత నారా లోకేష్ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నుంచి శంఖారావం కార్యక్రమం ప్రారంభించారు. మొదటగా ఇచ్చాపురంలో ఉదయం రాజావారి గ్రౌండ్స్ శంఖారావం కార్యక్రమం మొదలైంది. ఈ కార్యక్రమానికి భారీగా పసుపుదళం కదిలివచ్చింది. బాబు ష్యూరిటీ - భవిష్యత్తుకు గ్యారంటీ, మన టీడీపీ యాప్‌లో ప్రతిభకనబర్చిన 50 మంది కార్యకర్తలకు అభినందించారు.

కాగా, సభలో ప్రసంగం అనంతరం ఇచ్చాపురం నియోజకవర్గ పార్టీ కేడర్‌తో లోకేష్ ముఖాముఖిలో పాల్గొంటారు. పార్టీ కేడర్‌కు లోకేష్ చేతులమీదుగా సూపర్ 6 కిట్లు అందజేస్తారు. మరోవైపు పార్టీ కేడర్‌తో ఆయన ప్రతిజ్ఞ చేయించనున్నారు. కాగా, ప్రతిరోజు మూడు నియోజకవర్గాల్లో శంకారావం కార్యక్రమం నిర్వహిస్తారు. ప్రతినియోజకవర్గంలో నియోజకవర్గ పార్టీ కేడర్‌తో లోకేష్ ముఖాముఖి కార్యక్రమం ఉంటుంది. శంఖారావం కార్యక్రమం పూర్తి అయిన తర్వాత సాయంత్రం 7 గంటలకు నరసన్నపేట పరిధిలోని గ్రామ శివారులో లోకేష్ బస్ చేయనున్నారు.

Read More..

AP కాంగ్రెస్‌లో నయా జోష్.. ఊహించని రేంజ్‌లో హస్తానికి హైప్ తీసుకొచ్చిన YS షర్మిల..!

Advertisement

Next Story

Most Viewed