‘CM జగన్‌ గారు నన్ను క్షమించండి’.. టీడీపీ కీలక నేత సెల్ఫీ వీడియో విడుదల

by GSrikanth |
‘CM జగన్‌ గారు నన్ను క్షమించండి’.. టీడీపీ కీలక నేత సెల్ఫీ వీడియో విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: టికెట్ విషయంలో ఏలూరు టీడీపీ ఇన్‌ఛార్జి గోపాల్ యాదవ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన సెల్ఫీ వీడియో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీలో బీసీలు అంటే యనమల రామకృష్ణుడు, పుట్టా సుధాకర్ కుటుంబాలేనా? అని ప్రశ్నించారు. రాజకీయం ఆ రెండు కుటుంబాల గడప దాటకూడదా? అని మండిపడ్డారు. ‘పార్టీ పరంగా, మీ గురించి ఏమైనా మాట్లాడితే నన్ను క్షమించండి జగన్ గారు. టికెట్ల కేటాయింపులో మీరు సామాజిక న్యాయం పాటించారు. ఎంపీ, అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో బీసీలకు పెద్దపీట వేశారు. చంద్రబాబు మాత్రం నమ్మిన వారికి వెన్నుపోటు పొడిచారు. కేవలం డబ్బున్న వారికే టికెట్లు కేటాయించారు’ అని అంటూ అనూహ్యంగా గోపాల్ యాదవ్ సీఎం జగన్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. కాగా, ఏలూరు ఎంపీ అభ్యర్థిగా పుట్టా మహేశ్ యాదవ్‌ను చంద్రబాబు ప్రకటించడంతో ఆ నియోజవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి గోపాల్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Next Story