ఆ ఇద్దరిపై ఏడవడం మానేయ్..ధైర్యం ఉంటే ఈ ఇద్దరు ఎక్కడ అని జగన్‌‌ని అడుగు:విజయసాయిరెడ్డిపై అయ్యన్నపాత్రుడు ఫైర్

by Seetharam |
ఆ ఇద్దరిపై ఏడవడం మానేయ్..ధైర్యం ఉంటే ఈ ఇద్దరు ఎక్కడ అని జగన్‌‌ని అడుగు:విజయసాయిరెడ్డిపై అయ్యన్నపాత్రుడు ఫైర్
X

దిశ , డైనమిక్ బ్యూరో : ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరిపై ట్విటర్ వేదికగా వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. దగ్గుబాటి పురంధేశ్వరి ఏపీలో ఇసుక, మైనింగ్, మద్యం మాఫియా జరుగుతుందని పదేపదే ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. అంతేకాదు మద్యం విక్రయాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సైతం ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి విజయసాయిరెడ్డి బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరిని రాజకీయ పరంగానూ.. వ్యక్తిగతంగానూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఈ విమర్శలపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు అయ్యన్నపాత్రుడు స్పందించారు. ఉదయం లేస్తే ఇంట్లో ఆడవాళ్ళ పై పడి ఏడుస్తావ్ ఏంటి సాయిరెడ్డి అని నిలదీశారు. నారా భువనేశ్వరి,దగ్గుబాటి పురంధరేశ్వరిల గురించి ఏడవడం మానేయ్ అని సూచించారు. నీకు ధైర్యం ఉంటే విజయలక్ష్మి, షర్మిల ఎక్కడ? బాబాయ్ వివేకా ఎక్కడ అని జగన్‌ని అడుగు కసాయి రెడ్డి! అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు సూచించారు. ‘ఉదయం లేస్తే ఇంట్లో ఆడవాళ్ళ పై పడి ఏడుస్తావ్ ఏంటి సాయిరెడ్డి. భువనేశ్వరి గారు, పురంధరేశ్వరి గారి గురించి ఏడవడం మానేయ్. నీకు ధైర్యం ఉంటే విజయలక్ష్మి, షర్మిల ఎక్కడ? బాబాయ్ వివేకా ఎక్కడ అని జగన్ ని అడుగు కసాయి రెడ్డి!’ అని అయ్యన్నపాత్రుడు ఆదివారం ట్వీట్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed