ట్రాక్‌పై బండరాళ్లు.. నిలిచిపోయిన ప్యాసింజర్ రైలు

రైల్వే ట్రాక్ పై బండరాళ్లు పడటంతో కొత్తవలస- కిరండల్ ప్యాసింజర్ నిలిచిపోయింది...

Update: 2024-10-19 16:39 GMT

దిశ, వెబ్ డెస్క్: అల్లూరి జిల్లాలో వర్షాలు బీభత్సం సృష్టించాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన నేపథ్యంలో జిల్లాలో పలుచోట్ల భారీగా వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొన్ని చోట్ల చెట్లు, కరెంట్ స్తంభాలు, కొండచరియలు విరిగిపడిపోయాయి. టైడా-చిమిడిపల్లి రైల్వేస్టేషన్ మధ్య రైల్వే ట్రాక్‌పై బండరాళ్లు పడ్డాయి. దీంతో కొత్తవలస- కిరండల్ ప్యాసింజర్ నిలిచిపోయింది. రైల్వే సిబ్బంది 2 గంటల పాటు శ్రమించి మరమ్మతులు చేపట్టారు. అయితే రైలు ఆలస్యం కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరమ్మతుల అనంతరం ప్యాసింజర్ రైలు యథావిధిగా వెళ్లిపోయింది.


Similar News