కుప్పంలో నామినేషన్ దాఖలు చేసిన నారా భువనేశ్వరి

by Disha Web Desk 18 |
కుప్పంలో నామినేషన్ దాఖలు చేసిన నారా భువనేశ్వరి
X

దిశ,వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. గురువారం నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైన విషయం తెలిసిందే. మొదటి రోజు పలువురు కీలక నేతలు RO కార్యాలయాల్లో నామినేషన్లు దాఖలు చేశారు. కాగా రెండో రోజు నామినేషన్ల ప్రక్రియ ఊపందుకుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం భారీ ర్యాలీగా భువనేశ్వరి ఆర్వో కార్యాలయం వద్దకు చేరుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు తరఫున ఆయన సతీమణి నారా భువనేశ్వరి నామినేషన్ వేశారు.

కుప్పంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను ఆమె సమర్పించారు. నారా భువనేశ్వరి పలు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక ప్రసన్న వరదరాజ స్వామి ఆలయంలో నామినేషన్ పత్రాలను ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆమెకు వేదాశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ ర్యాలీలో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. దీంతో కుప్పం రోడ్లు జనసంద్రంగా మారాయి. కార్యకర్తలకు అభివాదం చేస్తూ ఆమె ముందుకు సాగారు.

Next Story

Most Viewed