ఎంపీ అవినాష్‌ అభివృద్ధి, అక్రమ మైనింగ్‌పై మాట్లాడటం హాస్యాస్పదం: టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్

by Mahesh |
ఎంపీ అవినాష్‌ అభివృద్ధి, అక్రమ మైనింగ్‌పై మాట్లాడటం హాస్యాస్పదం: టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్
X

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ కడప ఎంపీ అవినాష్ కు టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రంలో అభివృద్ధి, అక్రమ మైనింగ్‌పై ఎంపీ అవినాష్‌ మాట్లాడటం హాస్యాస్పదం అని ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్న సమయంలో కడప జిల్లాలో వందలాది ఎకరాలను దోచుకున్నారని ఆరోపణలు చేశారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఎస్పీ అన్బురాజన్‌ను తొత్తులా వాడుకున్నారని, పులివెందులలో మట్కా నడిపిస్తున్న వారు మీ పార్టీనేతలే అంటు విమర్శించారు. అలాగే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేశామని, మట్కాను అడ్డుకున్నామని ఈ సందర్భం టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్ చెప్పుకొచ్చారు.

Next Story

Most Viewed