AP Elections 2024:ఏపీలో 44,163 మంది వలంటీర్లు రాజీనామా: ఎంకే మీనా

by Disha Web Desk 18 |
AP Elections 2024:ఏపీలో 44,163 మంది వలంటీర్లు రాజీనామా: ఎంకే మీనా
X

దిశ,వెబ్‌డెస్క్:ఎన్నికల వేళ ఆంధ్రాలో వలంటీర్ల మూకుమ్మడి రాజీనామాలు జరిగిన విషయం తెలిసిందే. ఏపీలో పోలింగ్ ప్రక్రియపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా మీడియాతో మాట్లాడారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 44,163 మంది వలంటీర్లు రాజీనామా చేశారని తెలిపారు. ఎన్నికల సంఘం నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తించిన 1,017 మంది వలంటీర్లను విధుల నుంచి తప్పించామని పేర్కొన్నారు. మరో 86 మంది వలంటీర్లపై కేసులు నమోదయ్యాయని చెప్పారు. కాగా, వైసీపీకి ప్రచారం చేసేందుకు పలు నియోజకవర్గాల్లో వలంటీర్లు స్వచ్ఛందంగా రాజీనామా చేశారని తెలిపారు. మొత్తంగా ఈ సారి ఎన్నికల్లో 5,26,010 మంది ఎన్నికల సిబ్బంది పాల్గొంటుండగా.. పోలింగ్ డ్యూటీలో 3.30 లక్షల మందిని నియామకం చేసినట్లు ఎంకె మీనా వెల్లడించారు.

Next Story

Most Viewed